41.2 C
Hyderabad
May 4, 2024 19: 00 PM
Slider ఖమ్మం

తారకరత్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

#puvvada

ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి వారసుడు గా 2002లో హీరోగా తారకరత్న ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సాధించుకుని, ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కిన మంచి వ్యక్తిగా చిరస్థాయిగా తారకరత్న నిలిచిపోతారని కొనియాడారు.హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించి, షూటింగ్ దశలో మరో రెండు చిత్రాలు ఉండగా, రిలీజ్ కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్ ఉండగా ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమన్నారు.2009లో అమరావతి చిత్రానికి గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారక రత్న మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Related posts

ఇంటి ముందు, ఇంటి పైనా ఉప్పొంగిన దేశ భక్తి

Satyam NEWS

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Satyam NEWS

పండుగ వేళ గుండె పోటుతో జర్నలిస్టు సూరేపల్లె మృతి

Satyam NEWS

Leave a Comment