ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి వారసుడు గా 2002లో హీరోగా తారకరత్న ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సాధించుకుని, ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కిన మంచి వ్యక్తిగా చిరస్థాయిగా తారకరత్న నిలిచిపోతారని కొనియాడారు.హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించి, షూటింగ్ దశలో మరో రెండు చిత్రాలు ఉండగా, రిలీజ్ కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్ ఉండగా ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమన్నారు.2009లో అమరావతి చిత్రానికి గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారక రత్న మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
previous post