అత్యంత పకడ్బందీగా… పోలీసు బందోబస్తు నడుము… ఏపీ పోలీసు స్టేట్ లెవల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహిస్తున్న… సబ్ ఇన్ స్పెక్టర్ లకు రాత పరీక్షలు ప్రారంభం అయ్యాయి.నిర్ణయించిన సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సాక్షాత్తు బోర్డ్ చైర్మన్… చెప్పడంతో నిర్దేశించిన కేంద్రాల వద్ద సంబంధిత జిల్లా పోలీసు బాస్ ల ఆధ్వర్యంలో శాఖా సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
కాగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా… దాదాపు 4వేల మంది పురుషులు, మహిళలు పరీక్ష రాస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా లో జరుగుతున్న పది కేంద్రాలను ఎస్పీ దీపిక పరిశీలించారు. ఇందులో భాగంగా నగరంలో ని ఎంఆర్ కాలేజ్ వద్ద పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం… ఎస్పీ మాట్లాడుతూ… మొత్తం పది కేంద్రాల్లో ఎస్ఐ రాత పరీక్ష జరుగుతోందని చెప్పారు కాగా ఎంఆర్ కాలేజ్ వద్ద జరుగుతున్న పరీక్షా కేంద్రానికి. ఇద్దరు గర్భిణి లు…ఆదరబాదరా రావడం “సత్యం న్యూస్. నెట్” కెమారా కు చిక్కింది. అలాగే బురఖా వేసుకున్న… మరో మహిళ అభ్యర్థి ని ఎస్ఐ పరీక్షా రాసేందుకు రావడం తో”సత్యం న్యూస్. నెట్” క్లిక్ మనిపించింది.