కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపుర్ 116 డివిజన్ లోని జనతా నగర్ లో జరిగిన చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,TTD అడ్వైజరీ కమిటీ మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు. పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, విజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, విజయ్ నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని వడ్డేపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రావణ్,సాయి చంద్,జితేందర్,కృష్ణ శర్మ,కృష్ణంరాజు,మోహన్ గౌడ్,ప్రసాద్,వెంకట్ రెడ్డి, రాజు, హరికృష్ణ, దత్తాత్రేయ, అంకిత్ శర్మ,సుదర్శన్ ముదిరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.