పేద కుటుంబానికి చెందిన ఒక మహిళ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబానికి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర రావు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. పెంట్లవేల్లి మండలం కేంద్రానికి చెందిన మరికంటి చెన్నమ్మ అకస్మాత్తుగా మరణించారు.
విషయం తెలిసినా కూడా అనివార్య కారణాల వలన జగదీశ్వర రావు అక్కడకు వెళ్లలేకపోయారు. దాంతో దశదినకర్మ ఖర్చులకోసం పెంట్లవేల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు చేతుల మీదుగా 5,000/- ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
మరికంటి చెన్నమ్మ కుటుంబానికి జగదీశ్వరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంట్లవేల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు, పెంట్లవేల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు నారాయణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం గఫర్, కాంగ్రెస్ మండల నాయకులు నీరడి కురుమూర్తి, వడ్డే గోవిందు, బొడ గోపాలకృష్ణ, మరికంటి చెన్నకేశవ, అవుట రమేష్,మరికంటి కురుమయ్య, హరీష్, మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.