తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు పండ వద్ద )లో టీటీడీ నిర్మించిన శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, నవకలశ స్నపన క్షీరాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహనికి వేద మంత్రాల మధ్య పాలతో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.