నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చురుకుగా సాగింది. ఈ సందర్భంగా వసూలైన రుసుమును మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, మక్తల్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు, మక్తల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్త రంగినేని అభిలాష్ రావు టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కి అందచేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల, టౌన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
previous post