35.2 C
Hyderabad
May 11, 2024 18: 14 PM
Slider హైదరాబాద్

బాధితురాలు కోలుకునే వరకూ అన్ని రకాలుగా సహాయం చేస్తాం

#amberpet

హైదరాబాద్ లోని అంబర్ పేట్ డివిజన్ లోని ప్రేమ్ నగర్ కు చెందిన మాధురి అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు శనివారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ ని కలిసి వివరించారు. బాధితురాలి సమస్యను ఆయనకు తెలియజేశారు. వెంటనే స్పందించిన కార్పోరేటర్ తక్షణమే బాధితురాలి వైద్య సహాయానికి అలాగే మందులకు కావల్సిన ఆర్థిక సహాయాన్ని వారి బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాధితురాలు కోలుకునే వరకూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

హైద్రాబాదీల హృదయాలను దోచుకున్న హునార్ హాట్ అంతాక్షరి

Satyam NEWS

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

Satyam NEWS

నవీన్ ను పరామర్శించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment