హైదరాబాద్ లోని అంబర్ పేట్ డివిజన్ లోని ప్రేమ్ నగర్ కు చెందిన మాధురి అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు శనివారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ ని కలిసి వివరించారు. బాధితురాలి సమస్యను ఆయనకు తెలియజేశారు. వెంటనే స్పందించిన కార్పోరేటర్ తక్షణమే బాధితురాలి వైద్య సహాయానికి అలాగే మందులకు కావల్సిన ఆర్థిక సహాయాన్ని వారి బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాధితురాలు కోలుకునే వరకూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట