కేంద్రం పెంచిన పెట్రోల్ ,డీజిల్,వంట గ్యాస్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు పైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. తాడ్కోల్ చౌరస్తా వద్ద డప్పు కొడుతూ నిరసన తెలియ చేసారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని వారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాక ముందు దాదాపు ఐదు నెలలు పెంచకుండా ఆపి అంతర్జాతీయ సంక్షోభం అని సాకులు చెబుతూ ఇప్పుడు ధరలు పెంచుతున్నారని అన్నారు.
ప్రజలపై భారం వేస్తూ అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. పెట్రోల్,విద్యుత్ ధరలు పెరగడం సామాన్య మధ్య తరగతి ప్రజలపై ధరల ప్రభావం పడుతుందని టీపీసీసీ సభ్యులు బాన్స్ వాడ నియోజక వర్గ ఇంచార్జి కాసుల బాల్ రాజ్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమములో కామారెడ్డి జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు హన్మాండ్లు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సన్న చారి,పట్టాన అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి ,మండల అధ్యక్షులు మంత్రి గణేష్ ,అధికార ప్రతినిధి గుడాల నగేష్ ,నియోజక వర్గ యూత్ అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి,బీసీ మండల అధ్యక్షులు కొండా మీది రాములు, డైరెక్టర్ రేంజర్ల సాయిలు ,అజీమ్,కొట్టంల గంగాధర్ ,చందర్ నాయక్ ,సలీం ,విట్టల్ రెడ్డి ,షోయెబ్ ,మన్సూర్,రమేష్,హాన్మండ్లు నర్సింహా రెడ్డి ,చిదుర సంగమేశ్వర్, మోయింఖన్, మన్నన్, ,శ్రీనివాస్ రాయిస్ ,ఫ్యాక్రోద్దిన్ ,తదితరులు ,నాయకులూ పాల్గొన్నారు.
జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం