అణు పదార్ధాల రక్షణ అంశాలలో పాకిస్తాన్ భారత్ కన్నా మెరుగైన విధానాలను అవలంబిస్తున్నదని అమెరికా నిర్వహించిన సర్వేలో తేలింది. గతంలో చేసిన సర్వే కన్నా ఏడు పాయింట్లు మెరుగుపరచుకుని పాకిస్తాన్ భారత్ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లు అమెరికా వెల్లడించింది.
పాకిస్తాన్ 47 పాయింట్లతో 19వ స్థానంలో ఉండగా భారత్ 41 పాయింట్లతో 20వ స్థానంలో ఉంది. న్యూక్లియర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020 పేరుతో విడుదల చేసిన సర్వే నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. నూతన నియంత్రణలు పాటిస్తున్న పాకిస్తాన్ 25 పాయింట్లు మెరుగుపరచుకున్నది.