34.7 C
Hyderabad
May 5, 2024 01: 07 AM
Slider మహబూబ్ నగర్

కరోనా నిర్మూలన సేవాకార్యక్రమాలలో ఉప్పల ట్రస్ట్

#UppalaCharitableTrust

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి రహదారిలో కోవిడ్-19 సోకిన బాధితులు ఉన్నారని తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ద్వారా వారికి ఐసోలేషన్ కిట్లు అందజేశారు.

అదేవిధంగా చౌదర్ పల్లి గ్రామంలో ఎరుక రామయ్య అనారోగ్యంతో మరణించగా స్థానిక ఎంపీటీ సి తనయుడు రామస్వామి ద్వారా మూడు వేల రూపాయలు పంపించారు. చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఎన్నెడౢ లచ్చి రెడ్డి మృతిచెందడంతో మృతుని కుటుంబానికి మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య ద్వారా మూడు వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దారమేని గణేష్, క్రాంతి, రమేష్, రాంరెడ్డి, గోపాల్ గౌడ్ , స్వామి శ్రీశైలం, పెద్దయ్య ,దొడ్డు మల్లయ్య రాములు, బాలయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కాగుల కుమార్ యాదవ్  , పర్వతరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకోవాలి

Satyam NEWS

సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద కలకలం

Satyam NEWS

జనతా గ్యారేజ్: ట్రంప్ విధ్వంసానికి రిపేర్లు మొదలు

Satyam NEWS

Leave a Comment