హీరోయిన్ కుష్బూ కంటికి గాయమైంది. ఎవరో పొడవలేదండోయ్, పొరపాటున కత్తి తగిలి తన కంటికి గాయమైందని ఆమే స్వయంగా వెల్లడించింది. ఆమె కంటికి గాయం కావడంతో వైద్యులు చిన్న సర్జరీ చేశారు. తెగిన భాగానికి కుట్లు వేసి రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
ఈ కారణంగా తాను కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉంటానని కుష్బూ తెలిపింది. కరోనా సమయంలో అంతరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుష్బూ సూచించింది.
మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు,అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.