తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్ లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపింది. ఇప్పటికే 8 మంది ఖైదీలకు కరోనా సోకగా తాజాగా మరో 13 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు.
దీంతో కరోనా సోకిన ఖైదీలకు ప్రత్యేక బ్యారెక్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. జైలు సిబ్బందికి, ఇతర ఖైదీలకు కొవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. గత ఏడాది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు కరోనా బారిన పడ్డారు.
మళ్లీ సెకండ్ వేవ్ భయం వెంటాడుతున్న సమయంలో కేసులు బయటపడటం కలకలం రేపుతోంది.