సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో జనరల్ వార్డులతో పాటుగా కోవిడ్ – 19 బాధితుల కొరకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ -19 బాధితుల కొరకు ప్రత్యేక వార్డులో బెడ్స్,కోవిడ్ – 19 కిట్స్ , ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.బాధితులు ఎవరైనా నిర్భయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.