కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఆదేశానుసారం covid -19 వ్యాక్సినేషన్ పై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తు డ్రై రన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 25 మందికి డ్రై రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్ వచ్చి అది అందించే నాటికి సిబ్బందికి మరింత అవగాహన పెరుగుతుందని,తద్వారా లోటుపాట్లు అధిగమించేందుకు ఉపయోగ పడుతుందని అన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ ముందుగా ఫ్రాంట్ లైన్ వారియర్స్ కు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 50 సంవత్సరాల పైబడిన వారికి, ఆ తరువాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు ప్రమీల,నూర్జహాన్ బేగం, ఇందిరాల రామకృష్ణ, D.మంగమ్మ, ఝన్సీ, అలివేలు మంగ, స్వరూప, విజయలక్ష్మి, మాధవి, ప్రశాంతి, సంతోషం. ఉపేందర్,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.