29.7 C
Hyderabad
May 4, 2024 03: 48 AM
Slider నల్గొండ

డ్రై రన్ తో వైద్య సిబ్బందికి మరింత అవగాహన

#HujurnagarMedical

కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఆదేశానుసారం covid -19 వ్యాక్సినేషన్ పై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తు డ్రై రన్  కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 25 మందికి డ్రై రన్  నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్ వచ్చి అది అందించే నాటికి సిబ్బందికి మరింత అవగాహన పెరుగుతుందని,తద్వారా  లోటుపాట్లు అధిగమించేందుకు ఉపయోగ పడుతుందని అన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ ముందుగా ఫ్రాంట్ లైన్ వారియర్స్ కు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 50 సంవత్సరాల పైబడిన వారికి, ఆ తరువాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు ప్రమీల,నూర్జహాన్ బేగం, ఇందిరాల రామకృష్ణ, D.మంగమ్మ, ఝన్సీ, అలివేలు మంగ, స్వరూప, విజయలక్ష్మి, మాధవి, ప్రశాంతి, సంతోషం. ఉపేందర్,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

ప్రతిభ చూపిన గిరిజన గురుకుల విద్యార్ధులకు సన్మానం

Satyam NEWS

Master Plan farmers: 20 వ తేదీన ఎమ్మెల్యే ఇంటి ముట్టడి

Satyam NEWS

Leave a Comment