40.2 C
Hyderabad
May 5, 2024 15: 15 PM
Slider హైదరాబాద్

నేటి నుంచి హైదరాబాద్ లో సూపర్ స్ప్రె డర్స్ కు కరోనా వ్యాక్సిన్

#talasani

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి భారి నుండి అన్ని వర్గాల ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ని తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

శుక్రవారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, బన్సీలాల్ పేట లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో సూపర్ స్ప్రె డర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, స్థానిక కార్పొరేటర్ లు కోలన్ లక్ష్మి, కుర్మా హేమలత లతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ, కరోనా బాధితులకు చికిత్స అందించడం, మందుల సరఫరా తదితర విషయాలలో ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తుందని చెప్పారు.

జీహెచ్ ఎంసి పరిధిలో సర్కిల్ కు ఒకటి చొప్పున 30 కేంద్రాలను ప్రారంభించి సూపర్ స్ప్రె డర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని, సూపర్ స్ప్రె డర్స్ గా పిలవబడే కూరగాయల విక్రయదారులు, చిన్న వ్యాపారులు, అటో డ్రైవర్ లు, పుట్ పాత్ వ్యాపారులు తదితరులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జీహెచ్ ఎంసి అధికారులు టోకెన్ లను అందజేస్తారని, అందులో తెలిపిన సమయానికి కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జర్నలిస్ట్ లకు కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని తెలియజేశారు.

కరోనా సమయంలో డాక్టర్లు, నర్స్ లు, ఆశ వర్కర్లు, పోలీసులు, జీహెచ్ ఎంసి అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. లాక్ డౌన్ తో  ఆకలితో ఎవరు అలమటించ వద్దనే ఉద్దేశంతో ప్రతిరోజూ 60 వేల మందికి అన్నపూర్ణ బోజన కేంద్రాల ద్వారా ఉచితంగా బోజన సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

జీహెచ్ ఎంసి పరిధిలో ప్రతిరోజూ శానిటైజేషన్, పారి శుద్య నిర్వహణ పై ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతున్నట్లు వివరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంతమంది ఇలాంటి సమయాలలో రాజకీయ లభ్దిపొందే ప్రయత్నం చేయడం శోచనీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, dmc లు వంశీ, ముకుంద రెడ్డి, amoh లు భార్గవ్ తదితరులు ఉన్నారు.

Related posts

డ‌బుల్ ఇళ్ల శంకుస్థాప‌న‌.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sub Editor

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

Satyam NEWS

ఖమ్మం నగరంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ

Satyam NEWS

Leave a Comment