కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మి (79) అనే వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో ఆదివారం ఆమెను క్వారంటన్ కు తరలించడానికి అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్ చూడగానే ఆ వృద్ధురాలు ఒక్క సారిగా కుప్పకూలి పడిపోయింది.
అక్కడే ఉన్న వైద్యధికారులు పరీక్షించి ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. వృద్ధురాలు నడిరోడ్డుమీద చనిపోవడంతో,కరోనా సోకిన ఆ వృద్ధురాలి మృతదేహాన్నీ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం తో, దాదాపు 5 గంటలపై మృతదేహం అలానే ఉంది.
ఆమెకు సంబంధించిన బంధువులు అందరూ విదేశాల్లో ఉన్నారు. రోడ్డు వున్న మృతదేహాన్ని తరలించడానికి ఇంకా అధికారులు మినమేషలు లెక్కిస్తునేవున్నారు