అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు డిమాండ్ చేశారు.
పానగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళి అర్పించారు. దాడి జరిగి 4రోజులైనా ఇంతవరకు నిందితులను పట్టుకోకపోవడం అక్కడి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ గొప్పదనాన్ని ఎల్లేని గుర్తు చేశారు.