హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకాందనగర్ కాలనీ సొసైటీ ఆఫీస్ లో జరిగిన వివేకానందనగర్ కాలనీ వ్యవస్థాపకుడు ఎం వి కృష్ణ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ కృష్ణ రెడ్డి అకాల మరణం కాలనీ కి తీరని లోటు అని అన్నారు. కృష్ణ రెడ్డి కాలనీ అభివృద్ధికి, సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భముగా గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు పాటు మౌనం పాటించారు.
ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎప్పుడు సమాజం కోసం పరితపించేవారని అన్నారు. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన బాటలో పయనిస్తూ కాలనీ అభివృద్ధికి మరింత పాటుపడుదాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ భీమ్ రావు, నర్సయ్య, దేవినేని ప్రసాద్, వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, రాంచందర్, విజయ్ బాబు, అనంత రెడ్డి, జలందర్, సీతారామ రావు, కృష్ణ రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.