42.2 C
Hyderabad
May 3, 2024 17: 59 PM
Slider హైదరాబాద్

పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించిన బీజేపీ నేత

#BJPRahmatulla

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేనిదాని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ నాయకుడు షేక్ రహ్మతుల్లా అన్నారు. హైదరాబాద్ శివారులోని చందానగర్ లో ఆయన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వారికి నిత్యావసర వస్తువులను ఆయన అందచేశారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రతి నిత్యం వారు విధులు నిర్వర్తించడం వల్లే హైదరాబాద్ మహానగరం పరిశుభ్రంగా ఉందని ఆయన అన్నారు.

నగరం శుభ్రంగా ఉండటం వల్లే పరిశుభ్ర వాతావరణంలో కరోనా వైరస్ పురోగమించడం లేదని ఆయన అన్నారు. దీనికి అంతటికి కారణం పారిశుద్ధ్య కార్మికులని రహ్మతుల్లా కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులు అంకిత భావంతో పని చేస్తున్నందు ప్రతి ఒక్కరూ వారికి శాల్యూట్ చేయాలని కోరారు.

Related posts

మొక్కుబడి చర్చలు తప్ప ఫలితం లేదు

Satyam NEWS

గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వానికి విశేష స్పందన

Satyam NEWS

అధికార పార్టీ మహిమతో ఒక్కసారిగా దశ తిరిగింది

Satyam NEWS

Leave a Comment