రోడ్డు ప్రమాదంలో మరణించిన మునిసిపల్ కార్మికురాలి కుటుంబాన్ని కార్పొరేటర్లు ఆదుకున్నారు. GHMC కాప్రా సర్కిల్ లోని ఏ ఎస్ రావు నగర్ లో SFA గా పనిచేసే సౌందర్య కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ లో మరణించింది. కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, గొల్లురి అంజయ్య, పావని రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. యాక్సిడెంట్ కు కారణమైన ట్రక్కు ఓనర్ వద్ద నష్టపరిహారం ఇపిస్తామని అప్పటిలో హామీ ఇచ్చారు.
ఆ హామీని నెరవేరుస్తూ ఆమె కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు అందచేశారు. నెహ్రూ నగర్ లో ఆమె ఇంటి వద్దకు వెళ్లి పరిహారం అందచేశారు. అదే విధంగా సౌందర్య కుమారుడికి GHMC లో SFA ఉద్యోగం ఏర్పాటు చేయించారు. ఇప్పటికే అతను ఉద్యోగంలో చేరాడు. ఈ కార్యక్రమంలో మణిపాల్ రెడ్డి, వంజరి ప్రవీణ్, మదన, జగన్ ,బాబు,మల్లేష్, నాగేందర్ ,ఉపేందర్ ,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.