42.2 C
Hyderabad
April 26, 2024 18: 46 PM
Slider నిజామాబాద్

మంత్రి వేముల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

#Armoor Congress

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, బడుగుబాలహీన వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టిఆర్ఎస్ లో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని అన్నారు. మండల అభివృద్ధి కోరి పార్టీలో చేరిన రాజేశ్వర్ నమ్మకాన్ని నిజం చేస్తాం. అభివృద్ధి చేసి చూపిస్తాం అని మంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు బీడు భూములకు మళ్లించి పంటలు సమృద్ధిగా పండేటట్లు చేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రైతులు పండించిన పంటను మంచి ధరకు అమ్ముకునే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారని, వరి ధాన్యం, మక్కలు, ఎక్కువ పండిస్తే రానున్న రోజుల్లో డిమాండ్ తగ్గి మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారని అందువల్ల రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలని మంత్రి కోరారు.

 కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేండ్ల రవికి మంత్రి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉపేందర్ రెడ్డి,టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పూర్ణానందం, ఎంపిటిసి జక్కని మధు,సర్పంచ్ లావణ్య-గంగాధర్ పలువురు పాల్గొన్నారు.

Related posts

4 కోట్ల 31 ల‌క్ష‌ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కు  పంపిణీ

Satyam NEWS

బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ

Satyam NEWS

గాంధీ డాక్లర్లపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment