సంస్థాగత ఎన్నికలలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట పట్టణ టీడీపీ అధ్యక్షులుగా కడియాల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా గూడూరు శేఖర్ ను నియమించుకున్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ మేరకు వారికి సమాచారం అందిచారు.
మిగిలిన కార్యవర్గాన్ని త్వరలోనే అందరి అభిప్రాయ సేకరణతో ఎన్నుకుంటామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల సేవే పరమావధిగా ఉండాలని కొత్తగా ఎన్నికైన వారికి ఆయన మార్గదర్శనం చేశారు.