రాష్ట్రంలో పలు నూతన జిల్లా కోర్టుల ఏర్పాట్లు భాగంగా కొత్తగూడెంలో జూన్ 2న జిల్లా ప్రధాన న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ నియమితులయ్యారు .ఆయన ఆధ్వర్యంలో కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో గ్రీనరీ ని ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలను పెంచుతూ కోర్టు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు .దీనితో కోర్టు ప్రాంగణం కొత్త రూపురేఖల్ని సంతరించుకుంది. ఈ ఏర్పాట్ల పట్ల పలువురు న్యాయవాదులు ,న్యాయార్థులు హర్షం ప్రకటించారు.
previous post