రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న బటన్ యవ్వారంతో లబ్ధిదారులను మోసం చేస్తోందని జనసేన పార్టీ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా గంట్యాడ లోని ఓ రిసార్ట్ లో అయిదు రోజుల పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు. గతంలో కంటే తాను వచ్చిన సమయానికి కంట ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగుంజన్నారు.అయిదు రోజుల పాటు జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగిందన్నారు. ఎన్నో సమస్యలతో పార్టీ కి చెందిన కాని వారు ఈ అయిదు రోజుల సమావేశంలో ముందుంచారన్నారు…కొత్తగా చాలా మంది పార్టీలోకి వస్తున్నారన్నారు.
ప్రధానంగా మత్స్య,వ్యవసాయ, జగనన్న కాలనీలు పెను సమస్యలు గా ఉందన్నారు.. నాదెండ్ల మనోహర్. యువత కూడా జిల్లాలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన తో ఉన్నారని..జరిగిన సమావేశంలో సాలూరు కు చెందిన ఓ వ్యక్తి… దాదాపు జిల్లా లో ఎన్ని వాటర్ ఫాల్స్ అభివృద్ధి జరగకుండా మరుగున పడిందో మేపింగ్ తో చూపించారని పర్యాటకంపై జగన్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం గా ఉందో అర్ధమవుతుందన్నారు.ఇత్యాది అంశాలపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు.అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియా తో చిట్ చాట్ చేసారు. చాలా దారుణంగా జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందని… అన్నారు.