సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ పీసీ జి.రాజయ్య అంకితభావం, సమయస్ఫూర్తికి మెచ్చి ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్పీసీ విధులు నిర్వర్తిస్తున్న జి.రాజయ్య (2020 బ్యాచ్) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై టాస్క్ ఫోర్స్ /TTF లో విధులు నిర్వర్తిస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా.. కేబుల్ బ్రిడ్జ్ పై అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండేవారిని విచారించేవాడు. ఇలా ఇప్పటిదాకా గడిచిన నాలుగు నెలల్లో ముగ్గురి ప్రాణాలు కాపాడాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ జి. రాజయ్య. ఆత్మహత్యకు పాల్పడే వారిని కాపాడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని మాదాపూర్ లా & ఆర్డర్ పోలీసులకి అప్పగించేవారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించేవారు.
previous post