41.2 C
Hyderabad
May 4, 2024 16: 17 PM
Slider రంగారెడ్డి

ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పీసీ కి అభినందన

#cybarabad

సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ పీసీ జి.రాజయ్య అంకితభావం, సమయస్ఫూర్తికి మెచ్చి ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్పీసీ విధులు నిర్వర్తిస్తున్న జి.రాజయ్య (2020 బ్యాచ్) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై  టాస్క్ ఫోర్స్ /TTF లో విధులు నిర్వర్తిస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా.. కేబుల్ బ్రిడ్జ్ పై అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండేవారిని విచారించేవాడు. ఇలా ఇప్పటిదాకా గడిచిన నాలుగు నెలల్లో ముగ్గురి ప్రాణాలు  కాపాడాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ జి. రాజయ్య. ఆత్మహత్యకు పాల్పడే వారిని కాపాడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని మాదాపూర్ లా & ఆర్డర్ పోలీసులకి అప్పగించేవారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు వారికి  కౌన్సెలింగ్ నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించేవారు.

Related posts

శ్రీ వీరభద్ర స్వామి ఆలయ గోపురం పై పిడుగు పాటు

Satyam NEWS

సోమన్న యువసేన ఆధ్వర్యంలో నేడు  ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

అధైర్యపడొద్దు.. అండగా నేనుంటా.!

Satyam NEWS

Leave a Comment