స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమన్న యువసేన ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ల సౌజన్యంతో డివిజన్ పరిధిలోని బిజే ఆర్ కాలనీ జమ్మిగడ్డ రోడ్డు నెంబర్ 10 ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు, ఉచిత కరొన వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుంది.ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి కోరారు.