30.7 C
Hyderabad
April 29, 2024 05: 04 AM
Slider కడప

శ్రీ వీరభద్ర స్వామి ఆలయ గోపురం పై పిడుగు పాటు

#SriVeerabhadraswamyTemple

కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఉన్న అతి పురాతనమైన  శ్రీ వీరభద్ర స్వామి ఆలయ గర్భ గుడి గోపురం పై పిడుగు పడింది.

పిడుగుపాటుకు ఆలయంలోని ట్రాన్స్ఫార్మర్,జనరేటర్, లైట్లు దగ్ధం అయ్యాయి.

భారీ వర్షం పడుతుండడంతో గోపురం పైకి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో సమాచారం తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.

ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం పై పిడుగు పడటం రాష్ట్రానికి మంచిది కాదని పట్టణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

అయితే పెను ప్రమాదం తప్పిందని ఆలయ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్న అక్రమ చర్చి నిర్మాణం

Satyam NEWS

ఫ్యామిలీ డాక్టర్ పథకం ఆరోగ్యశ్రీకి రెండో దశ

Bhavani

రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా

Sub Editor

Leave a Comment