37.2 C
Hyderabad
May 6, 2024 12: 07 PM
Slider నల్గొండ

కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి

#hujurnagarcpm

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం అమరవీరుల స్మారక భవనంలో సిపిఎం హుజూర్ నగర్ మండల కమిటీ సమావేశం బుధవారం చింతకుంట్ల వీరయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నాగారపు పాండు మాట్లాడుతూ ఇటీవల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయని అన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్నారని,ధరలను తగ్గించాలని ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని,ప్రజలు ఆందోళన పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు పల్లె వెంకటరెడ్డి,మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్, మండల కమిటీ సభ్యులు చందాల బిక్షం, సిద్దిల వెంకటయ్య,మాధురి, నరసింహాచారి,పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, మీగడ రాములు,గడ్డం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

సీఎం కేసీఆర్ డిమాండుకు స్పందించిన కేంద్రం

Satyam NEWS

ఉగాది కానుక: 387 వలంటీర్లకు సేవారత్న అవార్డులు

Satyam NEWS

బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మాయావతి మద్దతు

Satyam NEWS

Leave a Comment