38.2 C
Hyderabad
April 28, 2024 20: 10 PM
Slider మహబూబ్ నగర్

మాదిగలను మోసం చేసిన బిజెపి

#mrps

బీజేపీ కేంద్రం లో అధికారంలోకి వచ్చిన వంద రోజులో ఎస్సీల వర్గీకరణ చేస్తామని  మాట ఇచ్చి మాటమరిచిందని MRPS తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎర్రమోని యాదగిరి మాదిగ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా మాదిగల మహా సంగ్రామ పాదయాత్ర లో భాగంగా రెండవ రోజు రామపూర్  నుంచి పెంట్లవెళ్లి మండలం చింతలపల్లి, ఎడ్మబెట్ల, జవాయిపల్లి, సింగోటం చేరుకున్నారు.

బీజేపీ పార్టీ పాలన 8 సంవత్సరాలు గడిచినా ఇంత వరకు SC రిజర్వేషన్లు  A,B,C,D ల వర్గీకరణ చేయకుండా భారత పార్లమెంట్ లో బిల్ పాస్ చేయకుండా జాప్యం చేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపి వచ్చే నెల 2,3 తేదిలలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుపుకోబోతున్నదని, ఈ సమావేశాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అదే విధంగా జులై 2వ తేదీన సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో ని హజీపూర్  దగ్గర ఉన్న  జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో MSF నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ బుక్కపురం మహేష్ మాదిగ, MRPS కొల్లాపూర్ శీలం శ్రీకాంత్  మాదిగ, బత్తిని పరమేష్ మాదిగ, MRPS అచ్చంపేట నియోజకవర్గం నాయుకులు కొయ్యల వెంకట్ మాదిగ, MSF కొల్లాపూర్ నాయకులు బైరపోగు శివ మాదిగ, బైరపోగు నాగరాజు మాదిగ, శీలం ప్రవీణ్ మాదిగ, బైరపోగు సింహాద్రి మాదిగ, బైరపోగు మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Satyam NEWS

గిరిజన యువతిపై అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ఏమన్నారంటే

Satyam NEWS

Leave a Comment