34.7 C
Hyderabad
May 5, 2024 02: 26 AM
Slider నిజామాబాద్

బీడీ కార్మికులకు అభయ హస్తం పింఛన్ ఇవ్వాలి: CPM డిమాండ్

#bediworkers

కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామ చార్బాయ్ బీడీ కార్మికులు ఉపాధి లేక ఎన్నో ఏళ్లగా బీడీలు చుట్టుకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు. చాలి చాలని వేతనాలతో వారి కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నారు. వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జుక్కల్ జోన్ కార్యదర్శి సురేష్ గొండ డిమాండ్ చేశారు.

జుక్కల్ మండల కేంద్రంలో MPDO కార్యాలయం ముందు జుక్కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ కు ఈ మేరకు వినతిపత్రం అందచేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అభయహస్తం  పింఛన్ ను PF కలిగిన జుక్కల్ గ్రామ చార్బాయ్ బీడీ కార్మికులకు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్. అజయ్.. జుక్కల్ జోన్ నాయకులు బాలాజీ పటేల్, కార్మికులు చంద్రకళ, సులోచన, తదితరులు పాల్గొన్నారు. జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

రాష్ట్రంలో పోర్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం

Satyam NEWS

మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు

Satyam NEWS

ప్రకాశం బ్యారేజికి వరద తాకిడి: 70 గేట్లు ఎత్తివేత

Satyam NEWS

Leave a Comment