కొల్లాపూర్ మండలం లో రెవెన్యూ భూములు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మార్వో కార్యాలయంలో జెసి శ్రీనివాస రెడ్డికి ఈ మేరకు సిపిఎం పార్టీ వినతి పత్రం అందచేసింది. అదే విధంగా పార్ట్ బి పెండింగ్ లో ఉన్న భూములను తక్షణ ఆన్ లైన్ చేయాలని కూడా సిపిఎం డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బి శివవర్మ మాట్లాడుతూ మండలంలో చాలా కాలంగా భూ సమస్యలు పరిష్కారం గాక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే సమస్యలను పరిష్కరించి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఆన్ లైన్ సమస్యలు పరిష్కారం కానందున రైతులకు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వకపోవడం రైతుబంధు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎండి సలీం తారా సింగ్ రాజు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.