42.2 C
Hyderabad
May 3, 2024 16: 25 PM
Slider కడప

రాజంపేటలో జగనన్నే మా భవిష్యత్తు,మా నమ్మ కం…

#Annamaiya district

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గంలో శుక్రవారం జగనన్నే మా భవిష్యత్తు,మా నమ్మ కం నువ్వే జగనన్న కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లి కార్జున రెడ్డి,జిల్లా చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పెద్దకారంపల్లి గ్రామ పంచా యతీ లోని మునక్కాయ పల్లి,రాజంపేట మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ మరియు నారపురెడ్డిపల్లి, ఎర్రబల్లి లో పర్యటించారు.

ఇళ్లకు వెళ్లి గత ప్రభుత్వ పాలనకు,జగనన్న ప్రభుత్వ పాలనకు ఉన్న వ్యత్యాసం గురించి ప్రచారం నిర్వహించారు.గ్రామస్తుల వారి మొబైల్ ఫోన్లకు, తలుపుకు స్టిక్కర్లు ను ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి,జిల్లా చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు అతికించారు.రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పోలా శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్ కళావతి , రాజంపేట జడ్పీటీసీ దాసరి పెంచలయ్య , రామ్మోహన్ నాయుడు, చికెన్ శ్రీను, చప్పిడి రఘురాం రెడ్డి , నాగేశ్వర్,నజీర్ భాష,చంద్రశేఖర్ రెడ్డి, ఏడుకొండలు, ఎంపిటిసి అలుగునూరు వరదరాజు,ఉపసర్పంచ్ వెంకటరాజు, రఘురాం రాజు గారు, కే రామసుబ్రహ్మణ్యం రాజు, డాక్టర్ శివకుమార్, హరీష్ , రాజశేఖర్ రాజు , రామలింగరాజు, మునివర్మ,నరసింహ,హరి ప్రసాద్ బాబు,ముఖ్య నాయకులు మరియు కన్వీనర్స్ మరియు కో కన్వీనర్స్ గృహ సారథులు వాలంటరీస్ నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులంతా పాల్గొని జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ నినదించారు.

Related posts

కరోనా ఎలర్ట్: చచ్చిపోతారని చెబుతున్నా వినకుండా…

Satyam NEWS

తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వ్యక్తి వైఎస్ఆర్

Satyam NEWS

హుజూర్ నగర్ గంగమ్మ జాతరలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment