29.7 C
Hyderabad
May 7, 2024 05: 56 AM
Slider నల్గొండ

విద్యుత్ బిల్లులను వెంటనే మాఫీ చేయాలి

#CPI Hujurnagar

విద్యుత్ బిల్లులను పూర్తిగా వెంటనే మాఫీ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు. మంగళవారం సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుజూర్ నగర్ ట్రాన్స్ కో ఏడీఈ కార్యాలయము ఎదుట నిరసన వ్యక్తం చేసి ఏడీఈ శ్రీనివాస్ కు మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా పాలకూరి బాబు మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటే విద్యుత్తు బిల్లులు పెంచటం దారుణమని అన్నారు. మూడు నెలల విద్యుత్ రీడింగులను తీయటం వలన బిల్లులు కరోన కంటే పెరిగిపోయాయని, పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించి మూడు నెలల లాక్ డౌన్ కాలంలోని విద్యుత్ చార్జీలను వెంటనే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రమేష్,కొప్పోజు సూర్యనారాయణ, కంబాల శ్రీనివాస్, జడ శ్రీనివాస్, ఇందిరాల వెంకటేశ్వర్లు, దేవరం మల్లీశ్వరి, గుండెబోయిన వెంకన్న, అమరబోయిన లింగయ్య, శ్వేత, కొట్టు మోహనరావు, చిలకరాజు గంగయ్య, బక్కయ్య, లక్ష్మమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Related posts

కడప జిల్లాలో పురివిప్పిన ఫ్యాక్షన్: టీడీపీ నేత దారుణ హత్య

Satyam NEWS

బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ

Satyam NEWS

కోతుల సంరక్షణకు గండి రామన్న హరితవనం

Satyam NEWS

Leave a Comment