కరోనా కేసులను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్ల రవి విడిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆదాయం లేని స్థితిలో ఉన్నారని, ఈ సమయంలో కరోనా సోకితే చికిత్స చేయించుకోవడానికి డబ్బులు ఉండవని ఆయన తెలిపారు.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనాను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కేసులను పరీక్షించే బాధ్యతను ప్రయివేటు ల్యాబ్ లకు ఇవ్వడం మంచిది కాదని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు ప్రభుత్వమే చేయాలని మల్లు రవి కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.