అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాల్లో రాత్రి పగలు తేడా లేకుండా కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు కట్ కావడంతో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
ఒకపక్క కరెంటు చార్జీల మోత,ఒక పక్క ఉక్క పోత,మరో పక్క దోమల మోత,ఒకపక్క పవర్ కట్.ఎప్పుడూ ఈ విధంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్,డిగ్రీ పరీక్షలు ఉన్న కూడా విద్యార్థుల భవిష్యత్ ఆలోచించకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోవడంపై విద్యార్థులు, తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
సంబంధిత విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా వారు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే పరిస్థితి లేదు.ప్రజా సమస్యలను పరిష్కరించ వలసిన స్థానిక నేతలు ఇలాంటి ఇబ్బందులను పరిష్కరించ కుండా, వాలంటీర్ లకు సన్మానం,క్రికెట్ పోటీల ప్రారంభం, గుళ్ళు ,గోపురాల ప్రారంభంలో బిజీగా ఉన్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి స్వంత మండలం నందలూరు లో కరెంట్ కష్టాలు మరి అధికంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లో ‘లుంగీ, టోపీ’ రచ్చ.. ప్రతిపక్షాలు గరం