దసరా మహోత్సవాలు శ్రీశైలమహాక్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల భ్రమరాంబిక కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ఏడవ రోజు శ్రీ స్వామి అమ్మవారు గజ వాహనంపై కొలువుదీరారు. శ్రీశైల భ్రమరాంబ దేవి అమ్మవారి ఉత్సవమూర్తిని కాలరాత్రి అలంకారం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజలో ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
పుష్పాలంకరణ శోభితులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను గ్రామోత్సవంలో కనులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
శ్రీశైలం నుంచి టి. నరేంద్ర రెడ్డి