డబ్బులు ఇప్పిస్తేనే తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తామని చెప్పిన కూతుళ్ళకు పోలీసులు, వైద్యుల కౌన్సిలింగ్ ఎట్టకేలకు ఫలించింది. ఇద్దరు కూతుళ్ళను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం ఉచితంగా అంబులెన్స్, జేసిబి ఇప్పించి అంత్యక్రియలకు ఒప్పించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కు చెందిన కిష్టవ్వ శనివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా కూతుళ్లకు వైద్యులు సమాచారం అందించారు.
అయితే అప్పటికే డబ్బుల విషయంలో తల్లి కిష్టవ్వతో కూతుళ్లు పెంటవ్వ, ఎల్లవ్వకు గొడవలు జరుగుతుండటం, తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని వదిలేసి వెళ్లిపోయారు కూతుళ్లు. శుక్రవారం తల్లి మృతి చెందిన విషయాన్ని కూతుళ్లకు తెలిపినా తల్లి అకౌంట్లో ఉన్న డబ్బులు ఇప్పిస్తేనే శవాన్ని తీసుకెళ్తామని చెప్పడంతో పోస్టుమార్టం వద్ద ఫ్రీజర్లో మృతదేహాన్ని భద్రపరిచారు. నేడు కూతుళ్లను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వగా శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు.