39.2 C
Hyderabad
May 4, 2024 19: 57 PM
Slider జాతీయం

మూగ చెవిటి దళిత బాలికపై సామూహిక అత్యాచారం

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో దారుణం జరిగింది. మూగ-చెవిటి దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూసింది. దుండగులు బాలికను బొలెరో కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రక్తపుమడుగులో అపస్మాకర స్థితిలో ఉన్న బాలిక ను చూసిబంధువులు ఆస్పత్రిలో చేర్పించగా ఆమెకు చికిత్స కొనసాగుతోంది. బాధితురాలి తండ్రి ధోరిమన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన చెవిటి-మూగ కుమార్తె సాయంత్రం ఎంఆర్‌టి రోడ్డు సమీపంలోని తన పొలంలో మేకలను మేపుతున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో బొలెరో కారులో వచ్చిన దుండగులు బాలిక నోరు నొక్కి సమీపంలోని అటవీ శాఖ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్పృహతప్పి పడిపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతకడం ప్రారంభించారు.

రక్తస్రావమై అపస్మారక స్థితిలో ఉన్న బాలికను అడవిలో గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ధోరిమన్నలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తీవ్రతను గమనించిన బార్మర్ పోలీసు సూపరింటెండెంట్ దీపక్ భార్గవ ధోరిమన్న పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, జరిగిన మొత్తంపై ఆరా తీశారు.

ధోరిమన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుని బాధితురాలి ఆరోగ్యంపై ఆరా తీసి కుటుంబ సభ్యులను పరామర్శించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. దీని తరువాత, పోలీసు సూపరింటెండెంట్ దీపక్ భార్గవ, పోలీసు అధికారుల బృందంతో రాత్రి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.బాధితురాలికి మెడికల్ బోర్డు వైద్యం చేయిస్తామని పోలీసు సూపరింటెండెంట్ దీపక్ భార్గవ తెలిపారు. దీంతో పాటు డాగ్ స్క్వాడ్ బృందంతో పాటు పోలీసు నిపుణుల సాంకేతిక బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి రప్పించారు. గుర్తు తెలియని దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Related posts

రిబ్బన్ కట్:పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ

Satyam NEWS

రెవెన్యూ అధికారులకు పదోన్నతులు

Murali Krishna

నేత్ర పర్వంగా శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాధ స్వామి కల్యాణం…..

Satyam NEWS

Leave a Comment