ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ జీవో 747 జారీ చేసింది. కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. 198 మందితో ఉన్న అడ్ హక్ ప్యానల్ నుంచి 66 మందిని ఎంపిక చేసింది. పదోన్నతులు తాత్కాలికమని జీవోలో పేర్కొంది.ముఖ్యమంత్రి జగన్ కనుసన్నలోనే ఈ పదోన్నతులు జరిగినట్లు తెలుస్తున్నది.
previous post
next post