కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని భవానీపెట్ గ్రామానికి చెందిన ఎండ్రియాల సౌందర్యకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. భవానీపెట్ చేరుకున్న 108 సిబ్బంది సౌందర్యను అంబులెన్స్ లోకి తీసుకున్న తరువాత పురిటి నొప్పులు అధికమవడం గ్రహించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది భవానీపెట్ గ్రామ శివారులోనే సౌందర్యకు సుఖప్రసవం చేశారు. ప్రసవ సమయంలో బాబు మెడకు బొడ్డు తాడు ఉందని గ్రహించి వెంటనే, 108 కాల్ సెంటర్ కు సమాచారం అందించగా ఫోన్ ద్వారా ఈ.ఆర్.సి.పి డాక్టర్ మహిత్ సూచనలు పాటించి, ఎంతో చాకచక్యంగా డెలివరీ చేశారు. సౌందర్య రెండవ కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల కోసం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని మాచారెడ్డి 108 సిబ్బంది తెలిపారు. సౌందర్యకు అంబులెన్స్ లో సుఖ ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బంది ఈయంటి నరేష్, పైలేటు రాజయ్యలకు సౌందర్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
next post