సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు
చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, ఈ రోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వంతో నిండిపోయారు. ఆదే విధంగా భారతీయుల కలను నిజం చేసేందుకు చంద్రయాన్ – 3 ప్రాజెక్ట్ బృందానికి మరియు ఇతర ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు ఇది ఒక చిన్న అడుగు, కానీ మొత్తం భారతీయ శాస్త్రీయ సమాజానికి ఇది ఒక పెద్ద ఎత్తు. భారతీయులమైన మనమం నిజంగా గర్విస్తున్నాం. దక్షిణ ధృవంలో ఈ ల్యాండింగ్ చరిత్ర లో చిరస్థాయి గా ఉండిపోతుంది అని ప్రొఫెసర్ సి వి నరసింహులు తెలిపారు. కళాశాల లో ఏర్పాటు చేసిన ప్రతీక్ష ప్రసారాన్ని కళాశాల ప్రిన్సిపాల్ తో సహా అధ్యాపకులు, విద్యార్థులు తిలకించారు. సివిల్ విభాగాధిపతి ప్రొఫెసర్ జగన్నాధ రావు, ప్రొఫెసర్ గణేశరావు , ప్రొఫెసర్ ఎమ్ స్వామిదాసు, డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్, డాక్టర్ కె వినయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్ వసంత గౌరీ ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు.