కడప జిల్లా రాజంపేటలో రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని ఆర్ & బి బంగ్లా వద్ద బుధవారం రాజంపేట జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు.
మొదటి రోజు శిబిరంలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ జె ఏ సి చైర్మన్ గుల్జార్ బాషా ఆధ్వర్యంలో రిలే దీక్ష లో కూర్చున్నారు.
వీరికి మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు అకేపాటి అమరనాధరెడ్డి, వైసీపీ పట్టణ నాయకులు పోలా శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ మహిళా నాయకురాలు మిరియాల సురేఖ, కాంగ్రెస్ నాయకులు పూల భాస్కర్, ఆడిటర్ పంత్ సంఘీభావం ప్రకటించారు.
అన్ని వనరులు వసతులు ఉన్న రాజంపేట ను జిల్లా గా ప్రకటించాలని సభలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు.