పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
వచ్చే నెల 10వ తేదీన ములుగు జిల్లాకు సంబంధించిన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు వరంగల్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్రీ- లిటిగేషన్ కేసులు, బ్యాoక్, ఎలక్ట్రిసిటీ, భూ తగాదా కేసులు, వివాహ/కుటుంబ తగాదాల కేసులు, మోటారు యాక్సిడెంట్స్ కేసులు, చిట్ ఫండ్, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడే వీలు ఉన్న కేసులను పరిష్కరిస్తారు.
ఈ సదవకాశాన్ని జిల్లాలోని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు.
కె. మహేందర్ గౌడ్, సత్యం న్యూస్