ఖమ్మం జిల్లాలో అభివృద్ధి ఘనంగా జరిగిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతణ దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి సందేశం ఇచ్చారు. జిల్లా
అభవృద్ధి ని వివరించారు. అంతకముందు బైపాస్ రోడ్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లులర్పించారు. మయూరి సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు అంజలి ఘటించారు.
సందేశం అనంతరం మంత్రి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, కమీషనర్ అఫ్ పోలీస్ విష్ణు ఎస్ వారియర్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, పాలేర్
శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ డి.సి.సి. బి. డైరెక్టర్ కూరాకుల
నాగభూషణం, డి.సి.ఎమ్.ఎస్. చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్ లు స్నేహలత మొగిలి, మధుసూదన్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ సురభి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నార