తండ్రి కూతురు బైక్ పై వెళుతుండగా మృత్యుపాశంలా దూసుకువచ్చింది ఒక ఆర్టీసీ బస్సు.
దాంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడిన దురదృష్టకర సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ క్రాస్ రోడ్డు వద్ద జరిగింది.
అక్కడి జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న హన్మకోండ 2డిపోకు చెందిన రాజధాని ఆర్టీసీ బస్సు బైకు కు ఢీ కొన్నది.
దాంతో బైక్ వై వెళుతున్న పులిగిల్ల కుమార్ (65) ఆయన కుమార్తె రమ్య (19) తీవ్ర గాయాల పాలయ్యారు.
స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో తక్షణమే వచ్చిన అంబులెన్సులో వారిని ఎంజీఎం కు తరలించారు.