ఉత్తరాంధ్ర ఇలవేల్సు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ దృష్ట్యా నైనా విజయనగరం రోడ్లను బాగు చేయించాలని టీడీపీ నేతలు ఐవీపీ రాజు తదితరులు గ్రీవెన్ సెల్ జాయంట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
అనంరతం కలెక్టరేట్ బయట మీడియాతో టీడీపీ నేత ఐవీపీరాజు మాట్లాడుతూ….విజయనగరం ఇలవేల్సు పైడితల్లి అమ్మవారి పండుగ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న రోడ్ల దుస్థితిపై జిల్లాయంత్రంగా దృష్టి సారించాలన్నారు.
సిరిమాను తిరిగే ప్రధాన రోడ్ల అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. తక్షణం అమ్మవారిని దృష్టిలో పెట్టుకునే నైనా సరే విజయనగరం రోడ్లను బాగు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.