మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనుల్లో వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ చాంబర్ లో మునిసిపల్ కమీషనర్లు, ఇంజనీర్లతో పనుల పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరు అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
టీయూఎఫ్ఐడిసి, ఎస్డీఎఫ్ తదితర నిధులతో పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆడిటోరియం, లైబ్రరీ, కమ్యూనిటీ హాళ్లు, డంపింగ్ యార్డ్ ల అభివృద్ధి, ప్రధాన రహదారులపై ఎల్ఇడి లైట్ల ఏర్పాటు, షాపింగ్ కాంప్లెక్స్, బిటి రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, షాదీఖానాలు, ట్యాoక్ బండ్ ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
ఇంకనూ చేపట్టని పనులు వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు. పనుల పూర్తికి పర్యవేక్షణ చేయాలన్నారు. పట్టణాల అభివృద్ధి పనులకు సమగ్ర డిపిఆర్ రూపొందించి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపల్ కమీషనర్లు సుజాత, రమాదేవి, వెంకటేశ్వర్లు, మునిసిపల్ ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.