ఆసరా పెన్షన్లకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాలు/మున్సిపాలిటీలలోని ఏదైనా కుటుంబములో ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించినట్లైతే వారి స్థానంలో వారి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఇప్పటివరకూ ఈ అవకాశమును వినియోగించుకోకుండా వున్న వ్యక్తులు
వెంటనే సంబంధిత మండల పరిషత్ కార్యాలయము/మున్సిపాలిటీ కార్యాలయం/ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించవలసినదిగా, దరఖాస్తుతో పాటుగా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మరణించిన వృద్ధాప్య పెన్షన్ దారుని యొక్క మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులను జతచేయవలసినదిగా జిల్లా కలెక్టర్ అన్నారు.