కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ శంకుస్థాపన కార్యక్రమం…విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాంలో సీఎం జగన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేతుల మీదుగా ప్రారంభంలో మొత్తం ఖాకీల హడావుడి కనిపించింది. ముందు రోజు భారీ వర్ష పడగా…శంకుస్థాపన కార్యక్రమం రోజు…. భానుడి భగభగలు చూపించాడు. మొత్తం 2వేల మంది పోలీసులచే పటిష్ఠమైన భద్రతల మధ్య ప్రారంభం అయింది. ప్రారంభానికి ముందే… పోలీసులు… సభా ప్రాంగణానికి… బస్సులలో వస్తున్న ప్రజలను… క్రమబద్ధీకరణ లో నిమగ్నమయ్యారు. కాగా గతంలో విజయనగరం డీఎస్పీ గా పని చేసిన అనిల్…ప్రస్తుతం పాడేరు ఏఎస్పీ గా ఉండటం.. విజయనగరం లో పని చేసే అనుభవం ఉండటంతో… సభా ప్రాంగణం.. మెయిన్ రోడ్ వద్ద ఇద్దరు ఏకే-47 గన్ లతో సెక్యురిటీతో విధులు నిర్వహించడం విశేషం.
previous post