30.7 C
Hyderabad
May 5, 2024 03: 05 AM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు: ఎంపీ ఆదాల వెల్లడి

#adala

 నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని కృష్ణపట్నం కాలువను గురువారం స్థానిక ఎమ్మెల్యే,మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో 400 కోట్లతో ఇరిగేషన్ కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

3000 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు, 500 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 100 కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ, జిల్లాలో  హైవే పై మూడు బ్రిడ్జిలు రానున్నాయని, తద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో వేయి కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ మంచినీటి పథకం పనులు పూర్తి చేయకపోయినా వేయి కోట్ల వడ్డీ భారం నెల్లూరు కార్పొరేషన్ పైన పడిందని బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, పాముల హరిప్రసాద్, అల్లాబక్షు, నరసింహారావు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు.

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకు ఎంపీ ఆదాల ప్రశంస

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రశంసించారు. కోవూరు నియోజకవర్గంలోని జేజే పేటలో గురువారం జరిగిన ‘గడపగడప’కు కార్యక్రమంలో ఆయనతో  కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ‘గడపగడప’కు కార్యక్రమంలో 23 వేల  ఇళ్లను తిరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశంసనీయులని అన్నారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అందరి ప్రేమకు పాత్రులయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బట్టే పాటి నరేంద్రరెడ్డి, రావూరు వెంకట శేషయ్య, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Related posts

వంటరి మహిళను వేధించి యాసిడ్ దాడి

Satyam NEWS

గ్రామాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం: మంత్రి పువ్వాడ

Satyam NEWS

ఒంటిమిట్టలో హంస వాహనం పై కోదండ రాముడు

Satyam NEWS

Leave a Comment